National
E6TV బ్రేకింగ్ న్యూస్ గాన కోకిల ఎస్ జానకి ఇక లేరు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తీరని లోటు..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్, దక్షిణ భారత గాన కోకిల ఎస్ జానకి (శిష్ట్లా జానకి) శనివారం కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసున్న జానకి అమ్మ, వయోసహజ అనారోగ్య సమస్యల కారణంగా మైసూర్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె…
తెలంగాణకు వరుణుడి నిరీక్షణ జులై చివరి 10 రోజులే కీలకం!
దేశవ్యాప్తంగా ఎల్-నినో తరహా ప్రభావం బలహీనంగా రుతుపవనాలు.. పెరుగుతున్న వర్షపాతం లోటు జూలై చివరికి దేశ వర్షపాతం లోటు 20 నుంచి 25 శాతానికి చేరే అవకాశం చివరి పది రోజుల్లో వర్షాలు కురవకపోతే.. ఆగస్టుపైనే ఆశలు స్పెషల్ స్టోరీ: నిజామాబాద్ జులై 11: (E6 న్యూస్) శివ ఠాకూర్ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు ఎందుకు పడటం లేదన్న ప్రశ్న ప్రస్తుతం రైతులతో పాటు సామాన్య ప్రజల్లోనూ…
మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ శివ ఠాకూర్ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. జిల్లా శిక్షణ మరియు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో, TOMCOM సౌజన్యంతో గురువారం నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తా జనార్దన్ గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆయన నగర మేయర్ ఉమారాణితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన…
ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం
**ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం****ముధోల్ (E6TV వెబ్ న్యూస్):**ముధోల్ మండల కేంద్రంలో దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.బుధవారం…
బాసరలో ఘనంగా అన్నప్రసాద వితరణ: గురు మార్గంలో నడవాలని భక్తుల పిలుపు
**బాసర (ఈ6టీవీ వెబ్ న్యూస్):**నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోదావరి నది సమీపంలో ఉన్న ఓం శ్రీ వరలక్ష్మి ఆశ్రమం ఆధ్వర్యంలో భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఆశ్రమ ఉత్తరాధికారి నర్సూరి శ్రీనాథ్ రావు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి మరుసటి రోజున శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజు పుణ్యతిథిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా పుణ్యతిథిని పురస్కరించుకొని పవిత్ర గోదావరి నది పుష్కర మొదటి ఘాట్ వద్దకు…
#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత
#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిమాండ్** జాబ్ క్యాలెండర్ అమలు చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి * **దిల్సుఖ్నగర్ నిరుద్యోగుల ధర్నాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక**దిల్సుఖ్నగర్, జూన్ 29:**నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్సుఖ్నగర్లో నిర్వహించిన నిరుద్యోగుల ధర్నాలో ఆమె స్వయంగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా…
జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!
జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!కేరళలో తీవ్ర సంచలనం సృష్టించిన జీడిపప్పు అభివృద్ధి సంస్థ (KSCDC) అవినీతి కేసులో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ హనీష్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ మేరకు హనీష్ దాఖలు చేసిన అప్పీల్ను కోర్టు…
నివాస ప్రాంతంలో వాణిజ్య అరాచకాలు.. ప్రశ్నించినందుకు కాకతీయ హిల్స్ అసోసియేషన్ ప్రతినిధులపై దౌర్జన్యం!
కాకతీయ హిల్స్లో నివాసితుల భద్రతకు ముప్పు కలిగించే చర్యలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని కాకతీయ హిల్స్ కాలనీ పూర్తిగా నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందినప్పటికీ, ఇటీవల కొంతమంది వాణిజ్య సంస్థలు, చిన్న హోటళ్లు, చికెన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాకతీయ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (KHWA) ప్రతినిధులు తెలిపారు. నివాసితుల ఫిర్యాదుల ప్రకారం, కొన్ని హోటళ్లలో కట్టెల…

