National
బస్వాపూర్లో తాగునీటి సరఫరాపై సమీక్ష
బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను…
మద్నూర్ ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం
మద్నూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి హాజరైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే…
పొనకల్–హైదరాబాద్ బస్సు సర్వీసు పునరుద్ధరించాలి
ఎర్గట్ల, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).పొనకల్ గ్రామం నుంచి హైదరాబాద్కు నిలిపివేసిన బస్సు సర్వీసును వెంటనే పునరుద్ధరించాలని ఎర్గట్ల మండల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డికి సర్పంచులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ, పొనకల్ నుంచి హైదరాబాద్కు నడిచే బస్సు సర్వీసు నిలిపివేయడంతో ఎర్గట్ల, మోర్తాడ్, వేల్పూర్ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో దోంచందా సీబీఎస్ బస్సు, గుమ్మిర్యాల్ నైట్…
మాజీ మంత్రి రేఖానాయక్ రైస్ మిల్ పై నమోదైన కేసు
నిర్మల్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్కు చెందిన రైస్ మిల్లు నుంచి ₹40.96 కోట్ల విలువైన ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయమైనట్లు గుర్తించి నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (సివిల్ సప్లైస్ కార్పొరేషన్) నిర్మల్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కేసు వివరాలు & ముఖ్యాంశాలు: మిల్లు వివరాలు:…
వేంసూరు మండలంలో అధికారుల పనితీరుపై ప్రజల ఆగ్రహం
ప్రభుత్వ లక్ష్యాలకు కొందరు అధికారుల తీరుతో గండి? ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు ప్రజావాణి ప్రచారంలో నిర్లక్ష్యం.. ప్రజలకు అందని సంక్షేమ పథకాలు స్థానికంగా అందుబాటులో లేని సిబ్బందిపై మండల ప్రజల అసంతృప్తి పనితీరులో మార్పు లేకుంటే చర్యలు తప్పవంటున్న ప్రజాప్రతినిధులు వేంసూరు,ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు సంక్షేమ పాలన అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి కొందరు అధికారుల పనితీరు అడ్డంకిగా మారుతోందని వేంసూరు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను…
H-1B వీసా ప్రక్రియను సరళతరం చేయండి: అమెరికా రాయబారికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ: అమెరికా వీసాల జారీ, H-1B వీసాల రెన్యూవల్ మరియు స్టాంపింగ్ ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం న్యూఢిల్లీలో భారత పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో వీసా సమస్యలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలోని ముఖ్య విజ్ఞప్తులు…
భీమ్గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్రెడ్డి
రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…
బైక్ దొంగల ముఠా అరెస్ట్.. రెండు బైకులు స్వాధీనం
మద్నూర్, ఆగస్ట్ 18: (E6tv NEWS: ప్రతినిధి). బైక్లను దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పట్టుకుని రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దేగ్లూర్కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బైక్లను దొంగిలించేందుకు…
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ నిజామాబాద్, ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల…
పేదలకు భూమి పంపిణీ చేయాలి: కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మరోసారి భూ పంపిణీ అవసరం అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకంతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి: కవిత బంజారాహిల్స్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే మరోసారి భూ పంపిణీ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు భూమి పంపిణీ చేయాలన్న డిమాండ్తో పాటు, తాము అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా ప్రతి…

