Breaking News
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో అప్రెంటిస్ల నియామకాలు
ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఆగస్టు 1 నుంచి 10 వరకు NATS 2.0 పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచన నిజామాబాద్, జూలై 31: E6 tv NEWS( శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో మూడు సంవత్సరాల అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ అవకాశాలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని…
ముధోల్ శిశు మందిర్లో రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్కు సన్నాహాలు పూర్తి
ముధోల్, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ (విజ్ఞాన మేళా)ను ఆగస్టు 30, 31 మరియు సెప్టెంబర్ 1 తేదీల్లో నిర్మల్ జిల్లా ముధోల్లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్ తెలిపారు.ఈ సైన్స్ ఫేర్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శిశు మందిరాల నుంచి సుమారు 500…
బాసర ఐఐఐటీలో విద్యార్థి అదృశ్యం కలకలం.. నాందేడ్లో క్షేమంగా లభ్యం
బాసర, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ-ఐఐఐటీ)లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన యశ ఋషింద్ర రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కళాశాల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.విద్యార్థి తల్లిదండ్రులను సంప్రదించిన అనంతరం కళాశాల అధికారులు ఉదయం అతనికి అవుట్పాస్ మంజూరు చేశారు. అనంతరం యశ…
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్కు కేంద్రం సానుకూల స్పందన
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు – ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ న్యూఢిల్లీ/నిర్మల్, జూలై 31 (E6TV): Md, అమీనుద్దీన్.ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు….
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను దారుణంగా మోసం చేస్తోంది.. బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర ధ్వజం!
హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేస్తోందని భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడమే కాకుండా, తమ హక్కుల కోసం ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీఛార్జీలు, పోలీసు బలగాలను ప్రయోగిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. సామాజిక మాధ్యమాల వేదికగా విద్యార్థులపై పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన ఎండగట్టారు….
ఆపదలో ఆపద్బాంధవుడిగా మాజీ ఉప సర్పంచ్ గడ్డం సుభాష్
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సమయాల్లో ఉచిత వాహన సేవ ప్రకటింపు ముథోల్, జూలై 30: E6 tv NEWS(ఆకుల తిరుపతి గౌడ్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలని మాజీ ఉప సర్పంచ్, సామాజిక కార్యకర్త గడ్డం సుభాష్ నిర్ణయించారు. ప్రజా సేవే తన లక్ష్యమని పేర్కొంటూ, మండల కేంద్రం ముథోల్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సమయంలో ఉచిత వాహన సేవ అందించేందుకు ఎల్లప్పుడూ…
లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు: కల్వకుంట్ల కవిత
ప్రభుత్వ ఈవీ ఆటోల నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం ప్రస్తుతం ఆటోలు నడుపుతున్న వారికే అవకాశం కల్పించాలని డిమాండ్ ఆటో డ్రైవర్లకు అండగా ఉద్యమిస్తామని తెలంగాణ రక్షణ సేన హెచ్చరిక హైదరాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆమె,…
SIR ప్రక్రియను జిల్లాలో 100 శాతం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను దాదాపు 100 శాతం పూర్తి చేసేలా బీఎల్ఏలు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కాట్పల్లి నాగేష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా PAC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని…
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS అమలు
ఆగస్టు 2న పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (TTC) ఆగస్టు–2026 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్–163 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.ఆగస్టు 2 (ఆదివారం) నిర్వహించే పరీక్షల సందర్భంగా నిజామాబాద్…
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఇందూరు, జూలై 30: E6 tv NEWS (శివ ఠాకూర్) గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీలు, నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు…

