Breaking News

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ పేరుతో సైబర్ మోసాలు.. పన్ను చెల్లింపుదారులకు TGCSB హెచ్చరిక!

హైదరాబాద్: ఆదాయపు పన్ను (Income Tax) దాఖలు చేసే సీజన్ నడుస్తున్న వేళ పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ప్రజలను అప్రమత్తం చేసింది. ఐటీ శాఖ అధికారుల పేరుతో నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిళ్లు మరియు లింక్‌లు పంపుతూ సైబర్ నేరగాళ్లు బ్యాంకింగ్ వివరాలు, సొమ్మును కాజేస్తున్నారని హెచ్చరించింది. బాధితులకు “మీ ఐటీ రిఫండ్ అప్రూవ్ అయింది” అని మెసేజ్‌లు పంపి, దాని కింద ఉండే “Claim…

Read More

హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించిన ధర్మపురి సంజయ్

హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చర్యలు అభినందనీయం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి నిజామాబాద్ జూలై 30: (E6 tv NEWS శివ ఠాకూర్). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా (HYDRAA) చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ ప్రకటించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, ప్రభుత్వ…

Read More

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లాలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు

విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటింపు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరిక వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచన నిర్మల్, జూలై 30: E6 tv NEWS (Md, అమీనుద్దీన్). నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేడు జిల్లాలోని…

Read More

రాత్రి వరకు తెలంగాణపై డిప్రెషన్ ప్రభావం.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!

తదుపరి 12-18 గంటలు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుల సూచన.. హైదరాబాద్, జూలై 30: (E6 tv NEWS: ప్రతినిధి).తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతున్న డిప్రెషన్ ప్రభావం రాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 12 నుంచి 18 గంటలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో…

Read More

ఎడతెరిపి వర్షాలకు పెంకుటిల్లు కూలిన ఘటన

అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మద్నూర్, జూలై 29: (E6 tv NEWS: ప్రతినిధి)ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో ఓ పెంకుటిల్లు బుధవారం కుప్పకూలింది. గ్రామానికి చెందిన సరడే హన్మంత్ (తండ్రి: మైసజీ) నివాసముంటున్న ఇల్లు వర్షం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.అయితే, గత వారం రోజుల…

Read More

సంస్కృత సాహిత్యానికి మూలపురుషుడు వేదవ్యాసుడు

వ్యాసపూర్ణిమ సందర్భంగా మద్నూరు గురుకులంలో ఘనంగా కార్యక్రమం వేదవ్యాసుని జీవితం, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డా. బి. వెంకట్. సంస్కృత  శ్లోకాలు, ప్రతిజ్ఞతో ఆకట్టుకున్న కార్యక్రమం మద్నూరు, జూలై 29: E6 tv NEWS (M. మస్నాజీ) సంస్కృత సాహిత్యానికి, అనంతమైన వైదిక వాఙ్మయానికి మూలపురుషుడు మహర్షి వేదవ్యాసుడేనని సంస్కృతభాషా ప్రచార సమితి నిజామాబాద్–ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి డా. బి. వెంకట్ పేర్కొన్నారు.సంస్కృతభాషా ప్రచార సమితి, సంస్కృతభాషా పరిరక్షణ సమితి,…

Read More

సెక్యూరిటీ రివ్యూ పేరిట రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు.. న్యాయపోరాటం చేస్తాం: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక!

హైదరాబాద్: తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) నాయకులకు రక్షణగా ఉన్న భద్రతను ఉపసంహరించుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యూరిటీ రివ్యూ కమిటీ (SRC) పేరుతో విపక్ష నాయకుల భద్రతను తొలగిస్తూ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లేవనెత్తిన ప్రధానాంశాలు: “తెలంగాణలో…

Read More

మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి వరంగల్‌లో ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్!

వరంగల్ / హైదరాబాద్: త్వరలో జరగనున్న వరంగల్, హైదరాబాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ పురపాలక పోరును ‘పాలిటిక్స్ సెమీఫైనల్‌’గా కాంగ్రెస్ భావిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితిలో సగం గడిచిపోవడంతో, ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మిస్ కాకూడదని అధిష్టానం స్పష్టం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాను…

Read More

అర్హులైన ధూంధాం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ఓట్యాట్‌పల్లిలో ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర, తెలంగాణ ఉద్యమ కళాకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి మాక్లూర్, జూలై 29:E6 tv NEWS (శివ ఠాకూర్).తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మాక్లూర్ మండలం ఓట్యాట్‌పల్లి గ్రామంలోని ఒడ్డేటవ్వ ఆలయం వద్ద జిల్లా…

Read More

కోర్ డిప్రెషన్ ఎఫెక్ట్.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

36 గంటల్లో 300–450 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం.. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు నిజామాబాద్ జూలై 29: E6 tv NEWS (శివ ఠాకూర్).  బంగాళాఖాతంలో ఏర్పడిన కోర్ డిప్రెషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే 36 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వాగులు, వంకలు…

Read More