Breaking News
ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం
నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రాత్మకం పీడిత ప్రజల విముక్తికి ఐక్య పోరాటాలు అవసరం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కొత్తగూడెం, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి)వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన అసమాన పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని, నేటి తరానికి ఆమె ఆదర్శప్రాయురాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో…
వ్యవసాయానికి 18 గంటలు విద్యుత్ ఇవ్వాలని వినతి
మద్నూర్, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) వ్యవసాయానికి రోజుకు 18 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సుల్తాన్పేట్ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు గురువారం మేనూర్లోని అదనపు సహాయక ఇంజినీర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయానికి కనీసం…
ఆర్య సమాజ్లో శ్రావణమాసం ముగింపు మహాయజ్ఞం
మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) మద్నూర్ మండల కేంద్రంలోని ఆర్య సమాజ్లో శ్రావణమాసం ముగింపు సందర్భంగా గురువారం మహాయజ్ఞం నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులు, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఏడాది శ్రావణమాసం ముగింపు అమావాస్య రోజున యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఆర్య సమాజ్ సభ్యులు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన మహాయజ్ఞంలో ఆర్య సమాజ్ సభ్యులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రావణమాసం సందర్భంగా చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముగింపుగా ఈ…
దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ
ముధోల్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ అన్నారు.ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోతన్న యాదవ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చూపిన తెగువ,…
ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు శిబిరానికి హాజరై, తమ తల్లిదండ్రులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఓటర్లు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో అర్హత, పత్రాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువీకరణ పత్రాల…
న్యూఢిల్లీలో BRICS సమ్మిట్: 30,000 మంది సైన్యంతో భారీ భద్రత!
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ వేదికగా జరగనున్న 18వ BRICS షికాగో సమ్మిట్ (సెప్టెంబర్ 12-13) నేపథ్యంగా రాజధానిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ల రాక సందర్భంగా చానక్యపురి హోటల్స్ మరియు భారత్ మండపం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భద్రతా బలగాల పహారా & ప్లాన్: దౌత్యవేత్తల వసతి నివాసాలు: ఈ భారీ విఐపి కాన్వాయ్ మూవ్మెంట్స్ మరియు భద్రత…
ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డు అందుకున్న అడ్వకేట్ యరగాని సోనీ
జూనియర్ న్యాయవాదిగా ప్రతిభకు గుర్తింపు హుజూర్నగర్,సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి). నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, హుజూర్నగర్ పట్టణానికి చెందిన అడ్వకేట్ యరగాని సోనీ ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డును అందుకున్నారు. కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్ అసోసియేషన్, కాళోజీ తెలంగాణ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదుల…
కోదాడలో 10 ఇళ్ల దొంగతనాలు ఛేదించిన పోలీసులు
రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, కారు స్వాధీనం కోదాడ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కోదాడ పట్టణంలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోదాడ పట్టణ పోలీసులు, జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు, హోండా అమేజ్ కారు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన…
తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్…
తెలంగాణ ప్రభుత్వం కానిస్టేబుల్ మరియు తత్సమాన పోస్టుల రిక్రూట్మెంట్లో గరిష్ట వయోపరిమితిని మరో 3 ఏళ్లు పెంచుతూ జీవో (G.O.Ms.No.129) విడుదల చేయడం ద్వారా వేలాది మంది ఉద్యోగార్థులకు ఊరట లభించింది. ముఖ్య అంశాలు & ముఖ్యాంశాల విశ్లేషణ: ఈ నిర్ణయం వల్ల వయోపరిమితి దాటిపోతుందన్న ఆందోళనలో ఉన్న నిరుద్యోగులకు TSLPRB రిక్రూట్మెంట్ ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు మంచి అవకాశం లభించింది.
బీఆర్ఎస్లో భారీ చేరికలు
కారెక్కిన సీపీఐ సీనియర్ నేత కిలారు ప్రసాద్ పాత కొత్తగూడెం 11వ డివిజన్ నుంచి సుమారు 100 మంది కార్యకర్తల చేరిక 100 మోటార్సైకిళ్లతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్కు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కొత్తగూడెం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో బుధవారం భారీగా చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామపంచాయతీకి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పాత…

