Breaking News

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్ జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి). కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ…

Read More

హైకోర్టు న్యాయమూర్తులకు నిజామాబాద్‌లో ఘన స్వాగతం

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్‌లు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం…

Read More

తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

జూలై 25: E6 tv NEWS ప్రతినిధి. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం ఉండటంతో భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.ధర్మం,…

Read More

అక్రమ సంబంధం, కుటుంబ విభేదాలే హత్యకు కారణం

రూ.6 లక్షల సుపారీతో అస్లాం ఖాన్ హత్య – అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన నిర్మల్ పోలీసులు – ఎస్పీ జానకి షర్మిల నిర్మల్, జూలై 25: E6 tv NEWS, Md అమీనుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అక్రమ సంబంధం, కుటుంబ విభేదాల నేపథ్యంలో…

Read More

విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం

యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…

Read More

లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరులో “గోమాత వైభవం” ప్రవచనం భక్తులను అలరించింది చాగంటి సేవలు సనాతన ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయం: ఎమ్మెల్యే గోవు మహిమను, భారతీయ సంస్కృతి విలువలను అద్భుతంగా వివరించిన చాగంటి ఇందూరు, జులై 24: E6 tv NEWS (శివ ఠాకూర్). లక్షలాది మంది ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ సనాతన ధర్మ విలువలను సమాజానికి చేరవేస్తున్న మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కొనియాడారు.ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా…

Read More

నీట్ పేపర్ లీక్‌పై నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ మైనారిటీ ర్యాలీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ నిర్మల్, జూలై 24 E6 tv news Md అమీనుద్దీన్: నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ మైనారిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ నాయకుడు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్ల మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల…

Read More

వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…

వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…

Read More

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్  ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్  దీర్ఘాయుష్షుతో ప్రజలకు…

Read More

విద్యార్థులపై దాడి అమానుషం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్‌లో మహాధర్నా ముధోల్, జూలై 24: E6 tv NEWS తిరుపతి గౌడ్. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. ఏఐసీసీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు…

Read More