Breaking News
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై భౌగోళిక, భౌతిక, సాంకేతిక అంశాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో కొనసాగుతున్న పరిశీలనను జిల్లా కలెక్టర్ అంకిత్ ఏఏఐ సాంకేతిక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన…
జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో 40 మందికి వాషింగ్ మిషన్ల పంపిణీ
మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మద్నూర్ పోస్టు కార్యాలయంలో 40 మంది అర్హులైన లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, బీజేపీ యువ నాయకుడు అజయ్ తమ్మేవార్ తెలిపారు. మద్నూర్ పోస్టు కార్యాలయానికి విశ్వకర్మ యోజనలో భాగంగా 40 వాషింగ్ మిషన్లు మంజూరు కాగా, అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ మిషన్లు లబ్ధిదారుల జీవనోపాధికి,…
భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి
మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులు భూ పత్రాలు, హద్దులు చూపించి సహకరించాలి పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నంబర్ 77లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రోవర్ పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, క్షేత్రస్థాయిలో…
గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ముందు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో…
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
ఆరోగ్య సూపర్వైజర్లకు డీఎంహెచ్ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచనలు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్ఓ, కొత్తగూడెం కార్యాలయ సమావేశ మందిరంలో ఆరోగ్య సూపర్వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. తుకారామ్ రాథోడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ భూక్యా రామ్ దాస్, డాక్టర్ టీ. ప్రతాప్, డాక్టర్ దినేష్, సంబంధిత ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష
అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత…
ఎన్నికల హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ను వదలం
కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన పాల్వంచ, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్…
తిరస్కరించిన ఓట్లను పునరుద్ధరించుకోవాలి
పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో తిరస్కరించబడిన ఓట్లను పునరుద్ధరించుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎస్ఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. పాత పాల్వంచలోని 78, 79, 80, 81 పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్లతో బీఎల్ఓలు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. ఓటు హక్కు…
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
అంగన్వాడి టీచర్ అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్బాబు ఏర్గట్ల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). అంగన్వాడి టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్పల్లి, ఇందల్వాయి పోలీస్…

