Breaking News

విషమిచ్చి చిరుతపులిని హతమార్చిన ఇద్దరు అరెస్ట్

శరీర భాగాలను విక్రయించి డబ్బు సంపాదించాలన్న యత్నం.. మరో నలుగురు పరారీలో… భీంగల్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని విషమిచ్చి హతమార్చిన ఘటనలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖకు అందిన సమాచారం మేరకు కమ్మర్‌పల్లి రేంజ్ అధికారి కే. అనిత ఆధ్వర్యంలో అధికారులు…

Read More

ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి.

బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలో నెరవేరుస్తామని స్పష్టం నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష పేరుతో నాటకాలు…

Read More

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు

పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్  శివ ఠాకూర్ వచ్చే ఏడాది 2027 సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పుష్కర…

Read More

ఆధునిక నిర్మాణ సాంకేతికతతో నాణ్యమైన భవనాల నిర్మాణం

షేర్ వాల్ టెక్నాలజీతో మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలోనూ ఈ సాంకేతికత అమలుకు కృషి చేస్తామని వెల్లడి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్ వాల్ (Shear Wall) టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…

Read More

ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: ముత్యాల సునీల్ కుమార్

భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి, ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమయ్యారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. భీంగల్ మండల కేంద్రంలోని ప్రతిపాదిత 100 పడకల ఆసుపత్రి వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 జూన్ 18న రూ.35 కోట్ల అంచనా వ్యయంతో…

Read More

తెలంగాణలో చెదురుమదురు జల్లులు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

నిజామాబాద్ జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్రంలో గత 24 గంటలుగా పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విస్తృతంగా కాకుండా పరిమిత ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. టీజీడీపీఎస్ (TGDPS) వివరాల ప్రకారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 17 మిల్లీమీటర్లు, నారాయణపేట…

Read More

మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్‌తోనే పూర్తి చేస్తాం

రైతులకు శాశ్వత సాగునీరే లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు డిజైన్ ఆధారంగానే పూర్తి చేసి రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.గురువారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని కొండెం–మంచిప్ప…

Read More

బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…

Read More

బాజిరెడ్డి గోవర్ధన్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు

మహాధర్నా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడం సిగ్గుచేటు: కాంగ్రెస్ నాయకుడు కొట్టం మనోహర్ కోటగిరి, జూలై 16 : E6 న్యూస్ అశోక్ కాంబ్లేమాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పదేళ్ల పాలనలో బాన్సువాడ నియోజకవర్గం, కోటగిరి మండల ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ ప్రశ్నించారు. మహాధర్నా పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆయన అన్నారు.కోటగిరి మండల కేంద్రంలో…

Read More

నిజాంసాగర్ కు వెంటనే నీరు అందించాలి

హల్దీ వాగు ద్వారా నీటి విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలి కోటగిరిలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మహాధర్నా.. అధికారులకు వినతిపత్రం కోటగిరి, జూలై 15: ఈ సిక్స్ న్యూస్ అశోక్ కాంబ్లేవర్షాభావ పరిస్థితులతో నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన వేలాది ఎకరాల పంటలు ఎండుముఖం పడుతున్నాయని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే…

Read More