Breaking News

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్ హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం: గణేష్ బిగాల

నిజామాబాద్, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీ సెప్టెంబర్ 5న ఉదయం 10:30 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభం కానుంది. యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఎన్నికల సమయంలో…

Read More

బల్దియా ఉద్యోగుల మెడకు  అవుట్సోర్సింగ్ ఉచ్చు!

జమ్మికుంట, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి).జమ్మికుంట బల్దియా ఉద్యోగుల మెడకు అవుట్సోర్సింగ్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఉద్యోగుల వ్యవహారాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు, గతంలో జరిగిన వ్యవహారాలపై అధికారులు ఆరా…

Read More

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం: బేకరీలో చెలరేగిన మంటలు..

కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని జగిత్యాల రోడ్డులో ఉన్న విశ్వ కెఫే బేకరీ (Vishwa Cafe) లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం దాదాపు 7 గంటల ప్రాంతంలో బేకరీ నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో పాటు లోపల మంటలు వేగంగా చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించగా, రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద వివరాలు…

Read More

ఇంకా నిరుపేదలు ఉన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది పేదలను ఆదుకోవాలిరోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి రుద్రూర్, సెప్టెంబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి) గ్రామంలో ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు….

Read More

జుక్కల్ చౌరస్తాలో బస్సు ప్రమాదం

డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…

Read More

నకిరేకల్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ…

నకిరేకల్/కట్టంగూర్: నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని కట్టంగూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య విషయాలు:

Read More

రేవంత్ కేబినెట్ రీషఫుల్: ముగ్గురు మంత్రులకు చెక్.. కొత్తగా ఎవరికి ఛాన్స్?!

హైదరాబాద్: మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ విస్తరణ, సమగ్ర పునర్వ్యవస్థీకరణకు సీఎం రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ భారీ మార్పులు జరగనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు, సామాజిక సమీకరణలు, పనితీరు ఆధారంగా ముగ్గురు మంత్రులకు కోత విధించి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు…

Read More

వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు!

హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జంట నగరాలలోని శ్రీకృష్ణుని ఆలయాలు, ఇస్కాన్ (ISKCON) మందిరాలు భక్తుల హరినామ స్మరణతో మార్మోగాయి. సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా సమీపంలోని ఆలయం, నాంపల్లి, అత్తాపూర్ తో పాటు బంజారాహిల్స్‌లోని ప్రసిద్ధ ‘హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్’ లో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం…

Read More

చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల ఉపాధ్యాయ వేడుకలు!

హైదరాబాద్ / కొడంగల్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ (సెప్టెంబర్ 5) వేడుకలను రాజధాని హైదరాబాద్ వెలుపల నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ప్రతి ఏటా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని బాల్ భవన్‌లో జరిగే ఈ వేడుకల వేదికను ఈసారి వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు మార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం…

Read More

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం!

హైదరాబాద్: మజ్లిస్ (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీల దేశభక్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కంటే ఒవైసీ సోదరులేమీ తక్కువ దేశభక్తులు కారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన బండి సంజయ్,…

Read More