Breaking News

భూగర్భ జలాలను పొదుపుగా వాడండి: రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి

హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ (వానకాలం) సీజన్ మిగిలిన కాలానికి గాను భూగర్భ జలాలను ఎంతో జాగ్రత్తగా, పొదుపుగా వినియోగించుకునేలా రైతులను చైతన్యపరచాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలోని దాదాపు 30 లక్షల ఎకరాల్లో కేవలం 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించే పరిస్థితి ఉండటంతో, ప్రభుత్వం ఇప్పుడు భూగర్భ జల నిల్వలపై దృష్టి సారించింది. ప్రధాన మార్గదర్శకాలు & నిర్ణయాలు: ఇటీవల కురిసిన వర్షాలు భూగర్భ జలాల పెరుగుదలకు పెద్దగా…

Read More

కాంగ్రెస్ తీరు వల్లే నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతోంది: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (NSP) ఆయకట్టు పరిధిలో నెలకొన్న కరువు పరిస్థితులకు ఎల్ నినో (El Niño) ప్రభావం కారణం కాదని, అది కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించిన కరువేనని బిఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. నల్గొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమైన అంశాలు & ఆరోపణలు: తక్షణమే నాగార్జునసాగర్ ఎడమ కాలువతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని,…

Read More

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

హుస్నాబాద్: రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం నిరంకుశత్వానికి నిదర్శనమని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం హుస్నాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ముఖ్యమైన అంశాలు & డిమాండ్లు: రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా…

Read More

భీంగల్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…

Read More

గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కుల పంపిణీ

బోధన్ ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బోధన్‌లోని గిరిజన బాలుర వసతి గృహంలో విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.గత వారం వసతి గృహాన్ని సందర్శించిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులు పలు సమస్యలను వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందకపోవడం, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడం, దోమతెరలు, లైట్లు, ఫ్యాన్ల కొరతతో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన నోటుబుక్కులు, మ్యాట్లు, ఇతర…

Read More

రైల్లో 24.3 కిలోల ఎండు గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్

నిజామాబాద్, ఆగస్టు 21: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున 12.35 గంటల సమయంలో సాయినగర్ షిర్డీ రైలులో RPF పోలీసులు, నిజామాబాద్ SHO ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తమ సీట్ల కింద రెండు సూట్‌కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. సూట్‌కేసులను తనిఖీ చేయగా మొత్తం 24.3 కిలోల ఎండు గంజాయి…

Read More

లింగంపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు

పెద్దకొడప్‌గల్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు గ్రామానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల కారణంగా వివిధ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను ప్రజలందరూ సద్వినియోగం…

Read More

మద్నూర్ మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మద్నూర్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) మద్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా వి. భీమ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కే. లక్ష్మణ్, కోశాధికారిగా పి. సురేష్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. దశరథ్, వైస్ ప్రెసిడెంట్లుగా సంపత్‌రెడ్డి, ఎస్. రాజు, సెక్రటరీలుగా పి. శ్రీనివాస్, టీ. విజయ్, కే. రాజు…

Read More

సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి: కాంగ్రెస్

ఎర్గట్ల, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకువచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ నాయకులు,…

Read More

ఒక హత్య.. ఎన్నో ప్రశ్నలు

గురువుకు గోరీ కట్టిన గంజాయి మత్తు! స్పెషల్ స్టోరీ, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి).చదువు చెప్పి జీవితానికి బాటలు వేయాల్సిన గురువే దారుణ హత్యకు గురికావడం.. ఆ హత్యకు పదో తరగతి చదువుతున్న విద్యార్థులే పాల్పడ్డారన్న దర్యాప్తు అంశాలు వెలుగులోకి రావడం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడటం, చెడు…

Read More