Breaking News
బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పరామర్శించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూరు, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ మాక్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. బీజేపీ నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఒడ్డెట్పల్లి, అమ్రాద్, బోర్గం, మాణిక్బండారు, గొట్టుముక్కల, మంతాపూర్ గ్రామాల్లో మరణించిన బీజేపీ…
పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జూలై 17న “ఇందూర్ రణభేరి” కార్యక్రమం నిర్వహణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపు ఇందూరు జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు పాత కలెక్టరేట్లోని ధర్నా చౌక్ వద్ద “ఇందూర్ రణభేరి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్…
ఈ నెల 16 నుంచి 24 వరకు ఇస్కాన్ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్రలు
ఇస్కాన్ రథయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలి జూలై 15 నిజామాబాద్: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇస్కాన్ (ISKCON) ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా శ్రీ జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రథయాత్ర జరిగే ప్రాంతాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని రామానంద రాయ్ గౌర దాస్ విజ్ఞప్తి చేశారు. రథయాత్రల షెడ్యూల్…
గృహనిర్బంధంతో గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
భీమ్గల్ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో, సీసీ రోడ్ల పనులు పూర్తి చేయాలని డిమాండ్ ఆర్మూర్/భీమ్గల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని, జైల్లో పెట్టినా ప్రజా సమస్యలపై తన పోరాటం ఆగదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే…
బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలు: మానాల మోహన్ రెడ్డి
ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు భీంగల్, జూలై 15: E6 న్యూస్ శివ ఠాకూర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రస్తుతం రాష్ట్రానికి శాపాలుగా మారాయని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. భీంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఆరోపించారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి…
జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం!
ప్రస్తుతం పొడి వాతావరణం.. 15 నుంచి పరిస్థితుల్లో మార్పు జూలై 16–19 మధ్య తెలంగాణలో చెదురుమదురు వర్షాలు.. వేడి నుంచి ఉపశమనం! జూలై 15: E6 న్యూస్ స్పెషల్ ఆర్టికల్: శివ ఠాకూర్ తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పొడి వాతావరణం, తీవ్రమైన ఎండల నుంచి ప్రజలకు త్వరలో కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న…
బబన్సా పహాడ్లో ఎన్ఫోర్స్మెంట్ దాడులు,152 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం
ఒక వ్యక్తి అరెస్టు.. పల్సర్ ద్విచక్ర వాహనం సీజ్ నిజామాబాద్, జూలై 14: E6 క్రైమ్ న్యూస్నిజామాబాద్ SHO పోలీస్ స్టేషన్ పరిధిలోని బబన్సా పహాడ్ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి 152 గ్రాముల ఎండు గంజాయితో పాటు…
SIR పై పూర్తి అవగాహన కల్పించిన భీంగల్ ఎమ్మార్వో ఎం.కిరణ్ కుమార్.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యవసరం అర్హులంతా తప్పనిసరిగా వివరాలు ధృవీకరించుకోవాలి – ఎమ్మార్వో సూచన భీంగల్, జూలై 13: E6 న్యూస్ శివ ఠాకూర్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు వివరాలను తప్పులులేకుండా రూపొందించడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR)…
హైదరాబాద్లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!
హైదరాబాద్లో పవర్ కట్స్: విశ్వనగరంలో అంధకారం.. అసలు కారణాలు ఇవే!ఈ6TV వెబ్ డెస్క్, హైదరాబాద్:గ్లోబల్ ఐటీ హబ్, ఆధునిక మౌలిక వసతులకు కేరాఫ్ అడ్రస్ అయిన భాగ్యనగరంలో కరెంట్ కోతలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. కాస్త గాలి వీచినా, వాన పడినా గంటల తరబడి కరెంట్ నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ సాంకేతిక లోపాలు ఎందుకు వస్తున్నాయి? TGSPDCL (తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) ఎదుర్కొంటున్న సవాళ్లు…
పోతంగల్ మంజీరా నదిలో నుండి అక్రమ ఇసుక రవాణా…?
రాత్రివేళల్లో జోరుగా తరలింపు జరుగుతోందని స్థానికుల ఆరోపణలు అధికారులు నిఘా పెంచాలని ప్రజల డిమాండ్ కోటగిరి జూలై 13: E6 న్యూస్:నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పోతంగల్ మంజీరా నది లో నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల నుంచి ఇసుక రవాణా ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతోందని వారు చెబుతున్నారు. పోతంగల్ నుంచి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు, స్థానిక ట్రాక్టర్ల ద్వారా,…

