Breaking News

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి)  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్…

Read More

బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో…

Read More

భీంగల్‌లో కాంగ్రెస్ 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవం

భీంగల్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం భీంగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, డీసీసీ అధ్యక్షుడు కట్పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో…

Read More

అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నాగేంద్రనగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత పొందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ.. పేద, అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ గుర్తింపు పత్రంగా నిలుస్తుందని తెలిపారు….

Read More

భాజపాది ‘ఓట్ల దొంగతనం’ కుట్ర: కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ (E6TV): కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) బిజెపియేతర రాష్ట్రాల్లో “ఓట్ల దొంగతనం” కుట్రలకు పాల్పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ‘సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బిజెపి చూస్తోందని ఆయన…

Read More

ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ఆరాటం

ప్రజా సంక్షేమంపై మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తాం: మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)  బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు….

Read More

విద్యార్థులకు బూట్లు, సాక్సుల పంపిణీ

ఏర్గట్ల, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) . ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు యూనిఫామ్‌లో చక్కగా కనిపించడంతో పాటు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బూట్లు, సాక్సులు అందజేస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు బూట్లు, సాక్సులు ధరించి రావాలని సూచించారు. యూనిఫామ్‌ను సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం,…

Read More

కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ ఉక్కుపాదం

నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన విఫలమైందంటూ నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలు రెండో రోజూ హోరెత్తాయి. నగరంలోని ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర విమర్శలు: వరుస నిరసనలతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Read More

కొండా సురేఖ బర్తరఫ్‌పై మండిపడ్డ డీకే అరుణ: బీసీ మహిళపై కక్షసాధింపా?

హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంపై మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో కొరవడిన క్రమశిక్షణ, అంతర్గత విభేదాల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆమె ఆరోపించారు. డీకే అరుణ విమర్శల ప్రధానాంశాలు:

Read More

నేపాల్‌ వరదల్లో వాట్సాప్ విప్లవం..

ఖాట్మండు: నేపాల్‌లోని త్రిశూలి వ్యాలీలో సంభవించిన భయానక జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. హిమపాతం బరస్ట్ కావడం వల్ల వచ్చిపడిన భారీ వరదలు, బురద మరియు కొండచరియల ప్రవాహానికి జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4,000 మందికి పైగా గల్లంతయ్యారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా రియల్ టైమ్ గైడెన్స్: భారీగా చేరుకున్న 22 లక్షల టన్నుల బురద, రాళ్ల శిథిలాల కింద జలవిద్యుత్ కేంద్రాల…

Read More