Breaking News
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి
కంటేశ్వర్లో ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న విధానం పరిశీలన నిజామాబాద్, ఆగస్టు 27: అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారు, అలాగే పేరు, వయసు తదితర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు హియరింగ్కు హాజరు కావాలని కోరుతూ బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు…
భీంగల్లో రోడ్ల గుంతలకు మరమ్మతు చర్యలు
భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్ పోసి బ్లేడ్ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు…
జుక్కల్లో ఘనంగా జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు
జుక్కల్, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జామియా మజీద్కు చేరుకున్నారు. ర్యాలీలో మత పెద్దలు, గ్రామ యువత, చిన్నారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు…
ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్కు ఐపీఎస్ హోదా.. ముజాహిద్ హుస్సేన్ సన్మానం
హన్మకొండ, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్కు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుల్ల కరుణాకర్కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుల్ల కరుణాకర్ తమ…
బాల్కొండలో గంజాయి ముఠాపై పోలీసుల దాడి.. 19 మంది పట్టివేత
బాల్కొండ, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ మండల వన్నెల్-బి వరద కాలువ గట్టు వద్ద గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో బాల్కొండ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న 18 మందితో పాటు గంజాయి విక్రయించేందుకు వచ్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. వరద కాలువ గట్టు వద్ద కొంతమంది గంజాయి సేవిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది…
ఫీజు బకాయిలు విడుదల చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలపై ఎన్. రామచందర్ రావు విమర్శలు
తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు (NRR) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.15,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్య విషయాలు & నిరసన ఘట్టాలు:
నిజామాబాద్లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ…
విలాసాగర్లో కాంగ్రెస్లోకి జోరుగా చేరికలు
విలాసాగర్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). జమ్మికుంట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మండల పరిధిలోని విలాసాగర్ గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రణవ్ వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ…
హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
హుజురాబాద్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం కోరింది.మంగళవారం సైదాపూర్ మండల పరిధిలోని ఆకునూరు గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ను మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, వైస్ చైర్పర్సన్ అంజలి, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులకు…
బీఆర్ఎస్ పార్టీలోకి 29వ డివిజన్ నుంచి భారీగా చేరికలు
మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన షేక్ మజీద్ షేక్ మజీద్తో పాటు సుమారు 100 మంది పార్టీ కండువా కప్పుకున్న వైనం బీఆర్ఎస్పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది: గణేష్ బిగాల పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి నిజామాబాద్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ నగరంలోని 29వ డివిజన్కు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో…

