Breaking News

గంగ తెప్ప మహోత్సవంలో తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు

ఏర్గట్ల,సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్వహించిన గంగ తెప్ప మహోత్సవంలో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు తొపారం రాజేశ్వర్‌ తెలిపారు. గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి గంగపుత్ర సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని…

Read More

1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు

ఏర్గట్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు – భారీ బైక్ ర్యాలీ ఏర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)..తెలంగాణలో రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు కావస్తున్న సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాల విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో బైక్‌లపై ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రధాన…

Read More

పాల్వంచలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సు

పాల్వంచ, సెప్టెంబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి). ప్రవక్త ముహమ్మద్ జన్మదిన మాసమైన రబీ-ఉల్-అవ్వల్‌ను పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలో నేడు మిలాద్-ఉన్-నబీ సదస్సును నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న మదర్సా అధ్యక్షుడు షేక్ యూసుఫ్ నివాసంలో ఒడ్డుగూడెం దారుల్ ఉలూమ్ నూరియా హనఫియా మదర్సా కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు ప్రవక్త ముహమ్మద్ జీవిత విశేషాలు, బోధనలు, సందేశాలపై ప్రసంగించనున్నారు. మదర్సా విద్యార్థులు నాత్…

Read More

పేదల సంక్షేమం కోసం శ్రమించిన మహోన్నత నేత జగ్జీవన్ రామ్

డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత నేత, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ బీసీఎం రోడ్డులో దండోరా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం…

Read More

ఎర్గట్ల ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఎర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం…

Read More

నడిరోడ్డుపై బైక్‌ స్టంట్లు.. యువకుడిపై కేసు

ప్రమాదకర వీలింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్న మఠంపల్లి పోలీసులు మఠంపల్లి, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నడిరోడ్డుపై ద్విచక్రవాహనంతో ప్రమాదకరంగా వీలింగ్‌ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుడిని మఠంపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మఠంపల్లి ప్రధాన చౌరస్తా నుంచి జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో పర్వతం గోపీచంద్ (19) అనే యువకుడు ద్విచక్రవాహనంపై అత్యంత ప్రమాదకరంగా స్టంట్లు…

Read More

ముత్యాలమ్మ జాతర నేపథ్యంలో పోలీసుల అవగాహన సదస్సు

శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు: సీఐ చరమంద రాజు అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలకు గట్టి హెచ్చరిక హుజూర్‌నగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) స్థానిక ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హుజూర్‌నగర్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమంద రాజు, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకునేలా…

Read More

నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ

ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్ నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి) టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్‌లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా…

Read More

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి)  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్…

Read More

బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో…

Read More