Breaking News

గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్). ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి…

Read More

కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు హెల్త్ కార్డు వర్తింపజేయాలి

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలి: టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీయూడబ్ల్యూజె హెచ్-143 జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ…

Read More

భీమ్‌గల్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ

భీమ్‌గల్, ఆగస్టు 12: E6 tv NEWS(T. గంగాధర్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్ పట్టణంలో మంగళవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.పట్టణంలోని సుదర్శన్ థియేటర్‌ నుంచి సుమంగళి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు, యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పాటు శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల, శ్రీ నారాయణ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….

Read More

అభిమానంతో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర

మద్నూర్ మీదుగా తమిళనాడుకు వెళ్తున్న మహారాష్ట్ర అభిమాని యాదవ్ హెగ్డోలే మద్నూర్ ఆగస్టు 11: (E6 tv NEWS: M. మస్నాజీ).తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ దళపతి పట్ల ఉన్న అభిమానంతో మహారాష్ట్రకు చెందిన ఓ అభిమాని సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ మండలం షెల్గవ్ గ్రామానికి చెందిన యాదవ్ హెగ్డోలే తన అభిమాన నాయకుడిని స్వయంగా కలిసి అభినందించాలనే ఆశయంతో పాదయాత్రగా తమిళనాడు బయలుదేరారు. విజయ్ దళపతి ముఖ్యమంత్రి…

Read More

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. 40 కేసులు నమోదు

20 మంది అరెస్ట్.. గుడుంబా, అక్రమ మద్యం సీజ్రాబోయే వారం స్పెషల్ డ్రైవ్: DPEO అరుణ్ కుమార్ నిజామాబాద్, ఆగస్టు 11: (E6 tv NEWS: శివ ఠాకూర్).మత్తు పదార్థాల వినియోగం, అక్రమ విక్రయాలు, రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు DPEO పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్, మోర్తాడ్ ప్రాంతాలతో పాటు DTF, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 40 కేసులు నమోదు…

Read More

భీంగల్‌లో అంగన్వాడీ ఉద్యోగుల ర్యాలీ.. రాస్తారోకో

భీంగల్, ఆగస్టు 10: E6 tv NEWS (T. గంగాధర్) దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక సంఘాల పిలుపులో భాగంగా భీంగల్ పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కైరిదేవ గంగు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల గోవర్ధన్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర…

Read More

ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీ ప్రారంభం

నిర్మల్ ఆగస్టు 10: E6 tv NEWS(Md. ఆమీనుద్దీన్). నిర్మల్ పట్టణంలో ప్రైమ్ ల్యాబ్ క్లినికల్ లేబొరేటరీని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించడంలో రక్త పరీక్షలు ఎంతో కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందేందుకు వైద్యుల సూచనల మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముందస్తు పరీక్షల…

Read More

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్

ఏర్గట్ల మండల కేంద్రంలో పలు కుటుంబాలకు పరామర్శ ఏర్గట్ల ఆగస్టు 9: E6 tv NEWS (T. గంగాధర్). బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఏర్గట్ల మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు గొల్ల వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లిన ముత్యాల సునీల్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని…

Read More

మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాలి

మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ భీంగల్ ఆగస్టు 9: (E6 tv NEWS: T. గంగాధర్). భీంగల్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులకు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫామ్‌లను వెంటనే అందించాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సున్నపు ఓంకార్ డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు అందించాల్సి ఉన్నప్పటికీ, గత రెండేళ్లుగా అధికారులు వాటిని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్‌లు…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి భారీగా తరలిరావాలి

మద్నూర్, ఆగస్టు 9: E6 tv NEWS (M. మస్నాజీ).మద్నూర్ మండల ప్రజలందరూ ఈ నెల 16వ తేదీన జరిగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు భారీ సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించాలని మద్నూర్ సర్పంచ్ సంతోష్ మేస్త్రి కోరారు.కందర్‌పల్లి DBL సమీపంలో నిర్వహించనున్న ఈ వివాహ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. మద్నూర్ మండల ప్రజలు కుటుంబ సమేతంగా వివాహ వేడుకకు తరలివచ్చి కార్యక్రమాన్ని…

Read More