Mahaboobnagar
నందిపేట్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
స్థానిక అధికారులతో కలిసి స్థల పరిశీలన క్రీడా స్థలానికి అనువైన భూమిని గుర్తించాలని ఆదేశం చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన బఫర్ జోన్లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం బఫర్ జోన్లోని వెంచర్ల అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశం మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నందిపేట్, ఆగస్టు 7: E6 tv NEWS (శివ ఠాకూర్)నందిపేట్ మండల కేంద్రంలో ఇటీవల మంజూరైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) ఏర్పాటుకు…
కొండాపూర్ ఊర చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ఎగువన కురిసిన వర్షాలకు తెగిపోయిన ఊర చెరువు కట్ట ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కల్వర్టు మరమ్మతులకు అధికారులకు ఆదేశాలు చరవాణిలో ఇంచార్జి కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే కల్వర్టులను సత్వరమే మరమ్మతులు చేపట్టనున్నట్లు వెల్లడి నష్టపోయిన పంట పొలాల రైతులకు ఆదుకుంటాం సిరికొండ ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి). ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు కట్ట తెగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్…
రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు
అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు–పెన్నుల పంపిణీ ఆర్భాటాలకు దూరంగా సమాజ సేవతో జన్మదిన వేడుకలు రాజేష్ ఠాకూర్ సేవా దృక్పథాన్ని కొనియాడిన బీజేపీ నాయకులు జమ్మికుంట,ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి). బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్భాటాలకు దూరంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా…
గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మృతి
పత్రికా రంగంలో విషాదం.. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధుల సంతాపం నిజాంసాగర్ ఆగస్టు 5: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మంగళవారం ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఆశన్న మృతి వార్త తెలిసిన వెంటనే జిల్లాలోని జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిజం పట్ల ఆయన చూపిన…
టీజీఎన్-ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం NATS 2.0 పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 10, 2026 వరకు గడువు నిజామాబాద్, ఆగస్ట్ 4: E6 tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎన్ఎస్-ఆర్టీఎస్) నిజామాబాద్ రీజియన్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రీజినల్ మేనేజర్ ఎన్. విజయకృష్ణ మూర్తి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.రీజియన్ పరిధిలోని డీజీఎం (ఇంజినీరింగ్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్…
బస్ స్టాండ్ను ఆధునికీకరించాలి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరు, ఆగస్టు 4: E6 tv NEWS ప్రతినిధి. నిజామాబాద్ నగర బస్ స్టాండ్ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ నగరానికి నూతన బస్ స్టాండ్ నిర్మాణం…
ప్రజల కోసం పనిచేయాలి.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దు: ముత్యాల సునీల్ కుమార్
మెండోరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన.. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఇంచార్జ్ విమర్శలు మెండోర, ఆగస్టు 4: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పదేపదే ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.మంగళవారం మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ఈ…
బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి 10 కీలక ప్రతిపాదనలు
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఆరోగ్య రంగ అభివృద్ధికి సంబంధించిన…
ఇందిరానగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మద్నూర్లో సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవం మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS(M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న…
అనారోగ్యంతో బాధపడుతున్న వార్డు సభ్యుడు బాబును పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నిజాంసాగర్, ఆగస్టు 3: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీ పరిధికి చెందిన 10వ వార్డు సభ్యుడు బాబు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు బాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి…

