Breaking News

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా…

Read More

మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు

మద్నూర్, ఆగస్టు 15:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

ఉత్తమ సేవల అవార్డు అందుకున్న మద్నూర్ కానిస్టేబుల్ విట్టల్

మద్నూర్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). ఉత్తమ సేవలు అందించినందుకు మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విట్టల్‌కు ప్రశంసా పత్రం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ నవీన్ చంద్ర చేతుల మీదుగా విట్టల్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల జరిగిన దారి దోపిడీ కేసులో నిందితులను గుర్తించడంలో కానిస్టేబుల్ విట్టల్ కీలకంగా వ్యవహరించారు. అలాగే మద్నూర్ మండల…

Read More

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

మద్నూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం గాంధీ చౌక్ ఆవరణలో గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళామణుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాలు నిర్వహించారు. కార్మెల్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు…

Read More

విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు

TSNPDCL ఏఈ సంజీవ్ కుమార్‌కు ప్రశంసా పత్రం నిర్మల్ ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాలేజ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిపేష్ మిశ్రా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అధికారులు సన్మానించారు. ఇందులో భాగంగా TSNPDCLలో ఏఈగా…

Read More

భీంగల్ ఎంపీడీవోకు ప్రశంసా పత్రం

నిజామాబాద్ ఆగస్టు 15: ,(E6 tv NEWS ప్రతినిది). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్‌కు ఘనమైన గౌరవం లభించింది. బోధన్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన సేవలను…

Read More

శాంతిభద్రతలే తెలంగాణ అభివృద్ధికి మూలస్తంభం: స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర శ్రేయస్సుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలే (Law and Order) ప్రథమ సోపానమని తేల్చి చెప్పారు. ప్రజా సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణతో పాటు రాబోయే కాలంలో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి…

Read More

ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS:శివ ఠాకూర్) నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ ఆధ్వర్యంలో, మంతం మధు…

Read More

త్యాగధనుల పోరాట ఫలితమే స్వాతంత్ర్యం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

నిజామాబాద్ ఆగస్టు 15: E6tv NEWS (శివ ఠాకూర్). దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

Read More

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్, హైదరాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: ప్రతినిధి) బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలి ఈ సందర్భంగా…

Read More