Breaking News
రైతుల ప్రయోజనాలే పరమావధిగా.. సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులపై సమగ్ర సమీక్ష.. జాప్యానికి కారణాలు తెలుసుకుని, అడ్డంకులు తొలగించాలని ఆదేశం జుక్కల్, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులతో పాటు ఇతర నీటివనరుల పురోగతిని అధికారులను అడిగి…
రైతన్నలకు శుభవార్త.. నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) రైతులకు శుభవార్త అందింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా, సక్రమంగా…
కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్
కేసీఆర్కు దగ్గరగా ఉన్న వారినే కవిత టార్గెట్ చేస్తున్నారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవితను కేసీఆర్కు తాను దూరం చేయడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండించారు.కవితను, కేసీఆర్ను కలపడానికి తానే ప్రయత్నించానని, విడగొట్టడానికి ప్రయత్నించానన్న విషయం…
సాదా బైనామా క్రమబద్ధీకరణలో కాంగ్రెస్ దగా: హరీశ్ రావు ధ్వజం
సాదా బైనామా క్రమబద్ధీకరణ పేరుతో రైతుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రోడ్డున పడేస్తోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. మక్తల్ నియోజకవర్గానికి చెందిన బాధితులైన రైతులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేయడంతో, ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. హరీశ్ రావు ఆరోపణలు –…
నీట్ పత్రాల లీకేజీ ఆందోళనలు: విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి నిరసనగా జూలై నెలలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో విద్యార్థులు, యువతపై నమోదైన ఎఫ్ఐఆర్ల (FIRs) మొత్తాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది….
తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ?: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేసులో?
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్నట్లు విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోపే (సెప్టెంబర్ 7 లోపు) ఈ కేబినెట్ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్… ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ముఖ్య విషయాలు & ప్రచారంలో ఉన్న అంశాలు: మంత్రి పదవుల రేసులో…
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు హుజూరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా వారం రోజుల నిరసన కార్యక్రమాలు ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్,ఆగస్టు 31: (E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక…
గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్…
బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
నియోజకవర్గ కేంద్రాన్ని కాదని మారుమూల గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు? జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన మన హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు బాల్కొండ, ఆగస్టు 31:(E6tv NEWS:ప్రతినిధి).బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మన హక్కుల కౌన్సిల్ సామాజిక, సాంస్కృతిక విభాగం ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం కింద రెండో అప్పీల్కు సంబంధించిన వినతిపత్రాన్ని…
సంక్షేమ హాస్టళ్లలో మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐపీఎస్యూ బోధన్, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి). సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) డిమాండ్ చేసింది.AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIPSU బోధన్ డివిజన్…

