Breaking News
విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల కేంద్రంలోని నడిమ హనుమాన్ మందిరం వద్ద విద్యుత్ వైర్లకు అడ్డుగా వస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ పరిశీలించారు.మందిరం ముందు శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న పనులపై విద్యుత్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో…
భీమ్గల్ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది: వేముల ప్రశాంత్రెడ్డి
రూ.35 కోట్ల 100 పడకల ఆసుపత్రి, రూ.3.50 కోట్ల సమీకృత మార్కెట్, సీసీ–బీటీ రోడ్లు, బస్ డిపో పనులు పూర్తి చేయాలి పెండింగ్ బిల్లులు విడుదల చేసి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ భీమ్గల్ ఆగస్ట్ 19: (E6tv NEWS ప్రతినిధి). భీమ్గల్ పట్టణ అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై, 70–75 శాతం వరకు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసి అర్ధాంతరంగా నిలిపివేసిందని మాజీ…
సలాబాత్పూర్ గ్రామానికి నూతన పోలింగ్ బూత్
మద్నూర్ ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). ఏళ్లుగా ఎదురుచూస్తున్న సలాబాత్పూర్ గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభించింది. సలాబాత్పూర్ గ్రామానికి ప్రత్యేకంగా నూతన పోలింగ్ బూత్ మంజూరు కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మద్నూర్ మండలం చిన్న శక్కార్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలాబాత్పూర్, చిన్న శక్కార్గ గ్రామాలకు గతంలో ఒకే పోలింగ్ బూత్ ఉండేది. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో సలాబాత్పూర్ గ్రామస్థులు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని చిన్న శక్కార్గ గ్రామానికి వెళ్లి తమ ఓటు…
ఎంపీడీఓ సాయిలును సన్మానించిన మెనూర్ సర్పంచ్
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సాయిలును మెనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పి. సాయిలు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మద్నూర్ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పనిచేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ…
ప్రపంచ ఫోటోగ్రఫీ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు ఫోటో జర్నలిస్టుల సేవలు అమోఘం ఇందూరు, ఆగస్టు 19:( E6tv NEWS:శివ ఠాకూర్). ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు…
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం ఆదిలాబాద్, ఇచ్చోడలో బిఆర్ఎస్ ధర్నా
ఆదిలాబాద్: పేద కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకులు, మహిళా కార్యకర్తలు ఆదిలాబాద్ మరియు ఇచ్చోడలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన ఆరోపణలు & ముఖ్యాంశాలు: ఈ నిరసన కార్యక్రమాల్లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అజయ్, సీనియర్ నాయకులు సాజిదుద్దీన్, యూనస్…
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడులను ప్రోత్సహించే స్వర్గధామమని, రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ (హరిత ఇంధన) తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హైటెక్స్, నోవోటెల్ వేదికగా ప్రారంభమైన రెండు రోజుల ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్పో 2026’ ను ఆయన మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. ప్రధాన ముఖ్యాంశాలు & క్లీన్ ఎనర్జీ లక్ష్యాలు: ఇంధన పరివర్తన (Energy…
బైక్ దొంగల ముఠా అరెస్ట్.. రెండు బైకులు స్వాధీనం
మద్నూర్, ఆగస్ట్ 18: (E6tv NEWS: ప్రతినిధి). బైక్లను దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పట్టుకుని రిమాండ్కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దేగ్లూర్కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బైక్లను దొంగిలించేందుకు…
పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ నిజామాబాద్, ఆగస్టు 18: (E6tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల…
కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు జుక్కల్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కౌలాస్ కోటను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న…

