Adilabad
కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా
నిజామాబాద్, సెప్టెంబర్ 9: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రముఖ తెలంగాణ కవి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. రాములు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాళోజీ నారాయణరావు గారు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి, తెలంగాణ…
రేషన్ కార్డుల పేరుతో కేటుగాళ్ల వసూళ్లు..
కలెక్టరేట్ ఉద్యోగి పేరుతో నకిలీ ఐడీ కార్డు భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS). రేషన్ కార్డులు ఇప్పిస్తామంటూ కలెక్టరేట్ జూనియర్ అసిస్టెంట్ పేరుతో నకిలీ ఐడీ కార్డు చూపించి పలువురి నుంచి నగదు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. బండి మధు పేరుతో ఉన్న ఐడీ కార్డును చూపిస్తూ రేషన్ కార్డులు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్నారని తెలిపారు.అయితే కొంతకాలం గడిచినా రేషన్ కార్డులు రాకపోవడంతో బాధితులు ఆరా తీయగా, తమకు చూపించిన ఐడీ…
ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు పొదెం వీరయ్య వినతి భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). ఏపీలో విలీనమైన యటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు.బుధవారం భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్హౌస్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదు గ్రామాలు ప్రస్తుతం ఏపీ పరిధిలో…
ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు
25 మంది స్వచ్ఛందగా రక్తదానం నిజామాబాద్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి, నుడా చైర్మన్ కేశ వేణు, హైకోర్టు అడ్వకేట్ పుల్లెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన…
దళిత స్పీకర్పై అసభ్య పదజాలం సరికాదు
బీఆర్ఎస్ నేతల దురహంకారానికి పరాకాష్ట.. బాల్కొండలో తాతా మధు, కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం బాల్కొండ, సెప్టెంబర్ 8: (E6 tv NEWS: ప్రతినిధి). శాసనసభ ఆవరణలో ఎమ్మెల్సీ తాతా మధు దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అసభ్యకర, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు, ఈ ఘటనకు…
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పి. నాగభూషణం మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామానికి చెందిన పి. నాగభూషణం ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. జగన్ మోహన్ రావు ముదిరాజ్ మంగళవారం నాగభూషణానికి నియామక పత్రాన్ని అందజేశారు.మారుమూల ప్రాంతమైన అంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవి దక్కడం పట్ల మద్నూర్ మండల ముదిరాజ్ సంఘ…
స్పీకర్ను దూషించిన ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి
కమ్మర్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కమ్మర్పల్లి, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన…
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రతిపాదిత స్థలాల పరిశీలన
పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సాంకేతిక నిపుణుల బృందం రెండు రోజులుగా ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తోంది. విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలతపై భౌగోళిక, భౌతిక, సాంకేతిక అంశాలను బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది.మంగళవారం ములకలపల్లి మండలం తిమ్మంపేటలో కొనసాగుతున్న పరిశీలనను జిల్లా కలెక్టర్ అంకిత్ ఏఏఐ సాంకేతిక బృందంతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో గుర్తించిన…
జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో 40 మందికి వాషింగ్ మిషన్ల పంపిణీ
మద్నూర్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా మద్నూర్ పోస్టు కార్యాలయంలో 40 మంది అర్హులైన లబ్ధిదారులకు వాషింగ్ మిషన్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం, బీజేపీ యువ నాయకుడు అజయ్ తమ్మేవార్ తెలిపారు. మద్నూర్ పోస్టు కార్యాలయానికి విశ్వకర్మ యోజనలో భాగంగా 40 వాషింగ్ మిషన్లు మంజూరు కాగా, అర్హులైన లబ్ధిదారులకు వాటిని అందజేశారు. ఈ మిషన్లు లబ్ధిదారుల జీవనోపాధికి,…

