Breaking News

లేండి వాగు వరదపై అప్రమత్తంగా ఉండాలి

గోజేగావ్ గ్రామస్థులకు ఎస్సై మోహన్‌రెడ్డి హెచ్చరిక మద్నూర్ ఆగస్టు 5:E6 tv NEWS (M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగావ్ గ్రామ ప్రజలు లేండి వాగు వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డి సూచించారు.బుధవారం లేండి వాగును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్ర నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాగు నీటిమట్టం మరింత…

Read More

మద్నూర్‌లో 27 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకా

గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఎంతో కీలకం: డా. శ్రీలేఖ మద్నూర్ ఆగస్టు 5:(E6 tv NEWS, M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 27 మంది బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) టీకా అందించినట్లు మండల వైద్యాధికారి డా. శ్రీలేఖ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ టీకా కీలక పాత్ర పోషిస్తుందని…

Read More

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మృతి

పత్రికా రంగంలో విషాదం.. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధుల సంతాపం నిజాంసాగర్ ఆగస్టు 5: E6 tv NEWS ప్రతినిధి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి ఆశన్న మంగళవారం ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఆశన్న మృతి వార్త తెలిసిన వెంటనే జిల్లాలోని జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ, సామాజిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జర్నలిజం పట్ల ఆయన చూపిన…

Read More

జుక్కల్ కేజీబీవీలో విద్యార్థినులకు ప్లేట్లు, గ్లాసులు, చెంచాల పంపిణీ

బస్వాపూర్ (కామారెడ్డి జిల్లా): E6 tv NEWS. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) మరియు జూనియర్ కళాశాల విద్యార్థినులకు గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ ఆధ్వర్యంలో ప్లేట్లు, గ్లాసులు, చెంచాలను పంపిణీ చేశారు.విద్యార్థినుల రోజువారీ అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అవసరమైన పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమణ సురేష్ గొండ మాట్లాడుతూ విద్యార్థినులు చదువును భారంగా కాకుండా ఇష్టంగా…

Read More

టీజీఎన్‌-ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం NATS 2.0 పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 10, 2026 వరకు గడువు నిజామాబాద్, ఆగస్ట్ 4: E6 tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎన్‌ఎస్-ఆర్టీఎస్) నిజామాబాద్ రీజియన్‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రీజినల్ మేనేజర్ ఎన్. విజయకృష్ణ మూర్తి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.రీజియన్ పరిధిలోని డీజీఎం (ఇంజినీరింగ్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్…

Read More

గ్రీన్‌వుడ్ స్కూల్‌లో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై పోలీసుల అవగాహన సదస్సు

విద్యార్థి దశ నుంచే సైబర్ భద్రతపై అవగాహన అవసరం: సీఐ చరమంద రాజు ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పిలుపు హుజూర్‌నగర్, ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి)విద్యార్థి దశ నుంచే సాంకేతికత వినియోగంతో పాటు సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని గ్రీన్‌వుడ్ స్కూల్‌లో సైబర్…

Read More

ఏర్గట్ల మండలంలో అక్రమ ఇసుక బహిరంగ వేలం

ఆగస్టు 7న తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహణ బట్టాపూర్‌లో స్వాధీనం చేసుకున్న 40 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక వేలానికి సిద్ధం ట్రిప్పుకు కనీస ధర రూ.2,000గా నిర్ణయం వేలంలో పాల్గొనాలంటే రూ.10,000 ధరావత్తు తప్పనిసరి వేలానికి ముందు ఇసుక నిల్వలను పరిశీలించే అవకాశం ఆసక్తి గల వారు ఆగస్టు 7 ఉదయం 11:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కావాలని సూచన ఏర్గట్ల, ఆగస్టు 5 (E6 tv న్యూస్  ప్రతినిధి).ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో ఇటీవల…

Read More

మేనూర్‌లో రోడ్డు ఆక్రమణలు వెంటనే తొలగించాలి

ఆక్రమణల తొలగింపునకు నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ మద్నూర్, ఆగస్టు 4: E6 tv NEWS (M. మస్నాజీ)కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం ఆదేశించింది. బస్టాండ్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు రహదారి ఇరుకుగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, పంచాయతీ కార్యదర్శి హరీష్ కుమార్ తెలిపారు. గ్రామంలోని ప్రధాన…

Read More

బస్ స్టాండ్‌ను ఆధునికీకరించాలి

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇందూరు, ఆగస్టు 4: E6 tv NEWS ప్రతినిధి. నిజామాబాద్ నగర బస్ స్టాండ్‌ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ నగరానికి నూతన బస్ స్టాండ్ నిర్మాణం…

Read More

వన్నెల్ బిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి.. ఆరు నెలల పాటు తల్లిపాలే ఉత్తమ ఆహారం: నిపుణులు బాల్కొండ, ఆగస్టు 4: E6 TV NEWS (తాటికొండ గంగాధర్)బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బక్కూరి వినోద ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమని, తొలి…

Read More