Hyderabad
కాంగ్రెస్ పార్టీలో చేరిన రాంనగర్ సర్పంచ్ స్వామి
ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్కు గుడ్బై.. 100 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్లో చేరిక నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.శుక్రవారం నిజామాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ మండలం రాంనగర్ గ్రామ సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్…
నందిపేట్ తహసిల్దార్పై సస్పెన్షన్ వేటు..?
నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు – సబ్ కలెక్టర్ విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్య నందిపేట్ జూలై 17 : E6 న్యూస్, శివ ఠాకూర్. నందిపేట్ తహసిల్దార్ సంతోష్ రెడ్డిపై జిల్లా యంత్రాంగం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించడం, లబ్ధిదారులతో కుమ్మక్కై అక్రమ మార్గంలో పట్టాలు జారీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనను సస్పెండ్ చేస్తూ…
సాలూరా మండలంలో మంజీరా నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
సాలూరా, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. సాలూరా మండలంలోని మంధర్నా, తగ్గేలి గ్రామాల పరిసరాల్లో ప్రవహిస్తున్న మంజీరా నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ఇసుకతో నిండిన ట్రాక్టర్లు బోధన్ వైపు తరలిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. తగ్గేలి గ్రామ సమీపంలోని మంజీరా నది గర్భంలో డోజర్ల సహాయంతో రాత్రి సమయంలో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు….
ఎస్ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచి 100 శాతం పూర్తి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి
భీంగల్లో పోలింగ్ బూత్ల పరిశీలన.. కాంగ్రెస్ నాయకులకు కీలక సూచనలు భీంగల్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియలో భీంగల్ పట్టణం వెనుకబడిన నేపథ్యంలో ఆయన శుక్రవారం అత్యవసరంగా భీంగల్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి…
గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం..?
చేయని నేరానికి జరిమానా విధించారని యువకుడి ఆరోపణ రైలు పట్టాలపై విషం తాగి ఆత్మహత్యాయత్నం.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బోధన్, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ విధించిన జరిమానా, వేధింపుల కారణంగానే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెలువడ్డాయి. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తాము చేయని నేరానికి…
విషమిచ్చి చిరుతపులిని హతమార్చిన ఇద్దరు అరెస్ట్
శరీర భాగాలను విక్రయించి డబ్బు సంపాదించాలన్న యత్నం.. మరో నలుగురు పరారీలో… భీంగల్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని విషమిచ్చి హతమార్చిన ఘటనలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖకు అందిన సమాచారం మేరకు కమ్మర్పల్లి రేంజ్ అధికారి కే. అనిత ఆధ్వర్యంలో అధికారులు…
ఆధునిక నిర్మాణ సాంకేతికతతో నాణ్యమైన భవనాల నిర్మాణం
షేర్ వాల్ టెక్నాలజీతో మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలోనూ ఈ సాంకేతికత అమలుకు కృషి చేస్తామని వెల్లడి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్ వాల్ (Shear Wall) టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…
తెలంగాణలో చెదురుమదురు జల్లులు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
నిజామాబాద్ జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ రాష్ట్రంలో గత 24 గంటలుగా పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విస్తృతంగా కాకుండా పరిమిత ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. టీజీడీపీఎస్ (TGDPS) వివరాల ప్రకారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో 17 మిల్లీమీటర్లు, నారాయణపేట…
మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్తోనే పూర్తి చేస్తాం
రైతులకు శాశ్వత సాగునీరే లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ మంచిప్ప–కొండెం చెరువు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన అసలు డిజైన్ ఆధారంగానే పూర్తి చేసి రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.గురువారం మోపాల్ మండలం మంచిప్ప గ్రామంలోని కొండెం–మంచిప్ప…
బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్ కొరకు నగరం నుండి 22 మంది తైక్వాండో క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ స్పోర్ట్స్:తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్కు నిజామాబాద్ జిల్లా నుంచి 22 మంది తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, పరీక్షలోనూ…

