Adilabad
కడెం ప్రాజెక్టుకు పొంగిపొర్లుతున్న వరద.. 6 గేట్లు ఎత్తి 48,000 క్యూసెక్కుల నీరు విడుదల!
హైదరాబాద్ / నిర్మల్: తెలంగాణ వ్యాప్తంగా గడిచిన కొద్దిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు (Kadem Project) కు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గురువారం నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు యొక్క 6 గేట్లను ఎత్తి దిగువకు 48,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 73,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో (వరద నీరు) వచ్చి చేరుతోంది. పెరిగే అవకాశం…
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లాలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు
విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటింపు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరిక వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచన నిర్మల్, జూలై 30: E6 tv NEWS (Md, అమీనుద్దీన్). నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేడు జిల్లాలోని…
రాత్రి వరకు తెలంగాణపై డిప్రెషన్ ప్రభావం.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!
తదుపరి 12-18 గంటలు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుల సూచన.. హైదరాబాద్, జూలై 30: (E6 tv NEWS: ప్రతినిధి).తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతున్న డిప్రెషన్ ప్రభావం రాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 12 నుంచి 18 గంటలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో…
ఎడతెరిపి వర్షాలకు పెంకుటిల్లు కూలిన ఘటన
అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మద్నూర్, జూలై 29: (E6 tv NEWS: ప్రతినిధి)ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామంలో ఓ పెంకుటిల్లు బుధవారం కుప్పకూలింది. గ్రామానికి చెందిన సరడే హన్మంత్ (తండ్రి: మైసజీ) నివాసముంటున్న ఇల్లు వర్షం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.అయితే, గత వారం రోజుల…
అర్హులైన ధూంధాం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
ఓట్యాట్పల్లిలో ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర, తెలంగాణ ఉద్యమ కళాకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి మాక్లూర్, జూలై 29:E6 tv NEWS (శివ ఠాకూర్).తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మాక్లూర్ మండలం ఓట్యాట్పల్లి గ్రామంలోని ఒడ్డేటవ్వ ఆలయం వద్ద జిల్లా…
కోర్ డిప్రెషన్ ఎఫెక్ట్.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక
36 గంటల్లో 300–450 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం.. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు నిజామాబాద్ జూలై 29: E6 tv NEWS (శివ ఠాకూర్). బంగాళాఖాతంలో ఏర్పడిన కోర్ డిప్రెషన్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే 36 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 300 నుంచి 450 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వాగులు, వంకలు…
ఫాం పాండ్ల నిర్మాణంతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం
మద్నూర్లో ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం మద్నూర్, జూలై 28: (E6 tv NEWS ప్రతినిధి). వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఫాం పాండ్లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ వీఓఏలు (VOAలు), సీసీలు (CCలు) పాల్గొన్న సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ డీఆర్డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, సురేష్ హాజరై ఫాం పాండ్ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిల్వలను…
స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు… వాడి గ్రామానికి ఇంకా రోడ్డు లేదు!
జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజలకు రహదారి, వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ “మమ్మల్ని ప్రతి నాయకుడు మోసం చేశాడు” అంటూ గ్రామస్తుల ఆగ్రహం జుక్కల్: E6 tv NEWS ప్రతినిధి (వాడి): కామారెడ్డి జిల్లా, జుక్కల్ నియోజకవర్గంలోని వాడి గ్రామ ప్రజల దుస్థితి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా మారలేదు. గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని,…
కోతుల బెడదకు చెక్ పెట్టిన యువకుడు
చింపాంజీ వేషంతో పంటలు, ఇళ్లను కాపాడుతున్న బాలాజీ నిర్మల్, జూలై 28: E6 tv NEWS(తిరుపతి గౌడ్) నిర్మల్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడదకు ఓ యువకుడు వినూత్న పరిష్కారం చూపి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. చింపాంజీ వేషం ధరించి కోతులను తరిమేస్తూ రైతులకు, గ్రామస్తులకు అండగా నిలుస్తున్నాడు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వీ గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉండటంతో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టాడు….
టౌన్-3 పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య
సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, డ్రగ్స్పై విస్తృత అవగాహన కల్పించాలి నిఘా వ్యవస్థ పటిష్టం చేసి ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలి నిజామాబాద్, జూలై 28 (E6 tv NEWS ప్రతినిధి): ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. మంగళవారం టౌన్-3 పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ…

