Hyderabad
త్యాగధనుల పోరాట ఫలితమే స్వాతంత్ర్యం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్ ఆగస్టు 15: E6tv NEWS (శివ ఠాకూర్). దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన నిరంతర పోరాటం, త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్, హైదరాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: ప్రతినిధి) బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలి ఈ సందర్భంగా…
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పలు ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: శివ ఠాకూర్). 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా…
టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపు నిజామాబాద్, ఆగస్టు 15:(E6 tv NEWS: శివ ఠాకూర్). దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ కార్యాలయంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల…
ఏర్గట్లలో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై అవగాహన
ఏర్గట్ల ఆగస్టు 14: (E6tv NEWS: T, గంగాధర్). మండల కేంద్రంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్రెడ్డి కోరారు. వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్తో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కిరాణా దుకాణాలు, చికెన్ సెంటర్లు, హోటళ్లను స్వయంగా సందర్శించి వ్యాపారులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహిత బయో ప్లాస్టిక్ బ్యాగులను సర్పంచ్, వార్డు సభ్యులు…
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 15న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 9 గంటలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు,…
భీంగల్లో ఘనంగా వన మహోత్సవం
ఇంటింటికీ మొక్కల పంపిణీ భీంగల్ ఆగస్టు 14: (E6 tv NEWS:T. గంగాధర్). ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణంలోని 7, 8, 9, 10, 11, 12వ వార్డుల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి, వైస్ చైర్పర్సన్ సంటి లత నర్సయ్య, మున్సిపల్ కమిషనర్…
గాజులపేటలో పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక క్యాంప్
నిర్మల్, ఆగస్టు 14: (E6 tv NEWS:Md మొయినుద్దీన్). స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గాజులపేటలోని డ్రీమ్ బ్రిడ్జ్ స్కూల్లో శుక్రవారం పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు ఫారాలను నింపించారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో క్యాంపునకు హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం ఈ…
CJI వ్యాఖ్యల వివాదం: బిసిఐ ఆదేశాలపై లీగల్ సమీక్ష జరపనున్న నాల్సార్ (NALSAR)
హైదరాబాద్లోని ప్రముఖ నాల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR University of Law) సమావర్తన ఉత్సవానికి (Convocation) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావడంపై కొంతమంది విద్యార్థులు చేపట్టిన వ్యతిరేక ప్రచారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) జారీ చేసిన ఆదేశాలను తమ అత్యున్నత నిర్ణయాత్మక మండలి ‘ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్’ ముందు ఉంచనున్నట్లు నాల్సార్ గురువారం…
పెన్షన్ల కోసం ప్రత్యేక క్యాంపు
నిర్మల్ ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేట్లోని ఈడెన్ గార్డెన్లో స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్యాంపు ద్వారా అవగాహన కల్పించారు.అర్హులైన ప్రజలు తమ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులతో క్యాంపునకు వచ్చి అవసరమైన వివరాలు సమర్పించాలని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా కోరారు. తెలంగాణ…

