పెద్ద ఏక్లారా, సెప్టెంబర్ 15:(E6tv NEWS: ప్రతినిధి).
గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన గ్రామ ప్రజలకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.
డిజిటల్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కార్యక్రమంలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

