హైదరాబాద్: పసిడి ప్రేమికులకు చేదు వార్త. భాగ్యనగరంలో బంగారం ధరలు మరోసారి కదలికలోకి వచ్చి స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ విలువలో మార్పులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర సుమారు ₹1,53,440 వద్ద నమోదైంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,40,650 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్లపై ₹270, 22 క్యారెట్లపై ₹240 మేర స్వల్ప పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించి బంగారంలో పెట్టుబడులు పెట్టడమే ఈ ధరల కదలికకు ప్రధాన కారణం.
అయితే మార్కెట్ నిపుణుల సూచన ప్రకారం… ప్రకటనల్లో కనిపించే బులియన్ ధరలకు, ఆభరణాల దుకాణాల్లో కొనుగోలు చేసే తుది ధరకు తేడా ఉంటుంది. వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు (తరుగు, మజూరీ) అదనంగా వర్తిస్తాయి. కాబట్టి బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేసే ముందే స్థానిక జువెలర్స్ వద్ద తాజా సమగ్ర ధరను నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

