Breaking News

భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

సంక్షేమ సమస్యలపై ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి

భీంగల్, సెప్టెంబర్ 17:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో కార్యాలయంలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ రమేష్, ఏపీవో నరసయ్య, ఏపీఎం ప్రమీల, సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *