Breaking News

బాల గణేష్ మండలి వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ దంపతులు

నిజాంసాగర్, సెప్టెంబర్ 18:(E6tv NEWS: ప్రతినిధి).

నిజాంసాగర్ మండల కేంద్రంలోని బాల గణేష్ మండలి వద్ద శుక్రవారం అన్నశాంతి (అన్నదాన) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజపల్లి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అనంతరం కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఆయన సతీమణి శైలజ బాల గణేష్ మండలిని సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు.

అన్నదాన కార్యక్రమం సందర్భంగా మండలి పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. మండలి నిర్వాహకులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *